ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల కలకలం.. 28 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 02:04 PM

థాయ్‌లాండ్‌ లోని ప్రీ-స్కూల్ చైల్డ్ డేకేర్ సెంటర్‌ లో ఓ మాజీ పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 28 మంది మరణించారని పోలీసులు తెలిపారు. థాయిలాండ్ లోని ఈశాన్య ప్రాంతంలోని నోంగ్ బువా లాంఫులో ఈ ఘటన జరిగింది. నిందితుడు పరారీలో ఉన్నాడని, మృతుల్లో పిల్లలు, పెద్దలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తి పిల్లలను, పెద్దలను కాల్చి చంపాడని చెప్పారు. దాడికి గల కారణం తెలియాల్సి ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa