ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతివాసుల కష్టాలు తీరనున్నాయా...శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ రెండవ దశ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 04:13 PM

తిరుపతి వాసుల సమస్య ఎటకేలకు తీరనున్నది. కాబట్టి ఇది తిరుపతివాసులకు శుభవార్తే. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ రెండవ దశను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. రూ.684 కోట్లతో తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ - టీటీడీ సంయుక్తంగా శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మిస్తోంది. రెండోదశ కరకంబాడీ - లీలమహల్ వైపు ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే,ర మేయర్ ఫ్లై ఓవర్ పై ప్రయాణం చేశారు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై మార్గాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఫ్లై ఓవర్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వారు నేరుగా కపిలతీర్థం చేరుకోవచ్చని ఆయన తెలిపారు. మూడో విడత నిర్మాణం పనులు కూడా జనవరికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.


టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక శ్రద్ధతోనే శ్రీనివాస సేతు రెండు దశల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి. జనవరికి తిరుచానూరు మార్గం నుంచి కూడా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో గాజుల మండ్యాం నుంచి అలిపిరి వరకు రూ.150 కోట్లతో రోడ్డు విస్తరణ చేస్తే సరిపోయేదని.. చంద్రబాబు తప్పుడు నిర్ణయం వల్ల ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించడం.. ఫ్లై ఓవర్ నిర్మాణం తప్పలేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa