ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం...తొమ్మిది మంది మరణం

national |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 11:41 PM

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా కేరళలో గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాలక్కాడ్‌లోని వడక్కంచేరిలో జరిగిందీ ఘటన. విద్యార్థులతో కూడిన ఓ టూరిస్టు బస్సు కేరళ ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్, ముగ్గురు కేఎస్‌ఆర్టీసీ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


ఎర్నాకుళం జిల్లాలోని బేసెలియస్ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్ర కోసం తమిళనాడులోని ఊటీ వెళ్తుండగా, కేఎస్ ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గాయపడిన వారిలో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa