ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ దేవాదాయశాఖపై స్వరూపానందేంద్ర సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 09:23 PM

పేరుకుపోయిన భూ వివాదాల నేపథ్యంలో  ఏపీ దేవాదాయ శాఖ తీరుపై విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్గత కలహాలతో అధికారులు దేవాదాయ శాఖను భ్రష్టుపట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారని.. పెరుగుతున్న భూవివాదాలు, భూ కబ్జాల దృష్ట్యా దేవాదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమే అని అభిప్రాయపడ్డారు. అలాగని దేవాదాయశాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉందని.. 12 ఏళ్ళుగా దేవాదాయ శాఖలో ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు స్వామీజీ. కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. అలా వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లు పరిస్థితి ఉందని.. రెవెన్యూ అధికారుల నియామకాన్ని తొలినుండే వ్యతిరేకిస్తూనే ఉన్నానన్నారు. స్వరూపానందేంద్ర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa