ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోం: సీఎం వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 09:25 PM

రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల ఫిర్యాదులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్  సీరియస్‌గా స్పందించారు. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్‌ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని.. ధరలు పతనమై నష్టపోతున్నామన్నారు రైతులు. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదు చేశారు. తన దృష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు.


ముగ్గురు మంత్రులు, సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. వారంరోజుల్లో నివేదిక అందించాలన్నారు. ఆ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు విజయానంద్‌, పూనం మాలకొండయ్య, కన్నబాబులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa