ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 09:30 PM

ఈ నెల 14వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌వేశించ‌నుంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న రాహుల్ యాత్ర‌... ఈ నెల 14న ఏపీలోని అనంత‌పురం జిల్లా డీ హీరేహాళ్ కు చేర‌నుంది. ఏపీ, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు గ్రామ‌మైన డీ హీరేహాళ్ కు చేర‌డంతో రాహుల్ యాత్ర ఏపీలోకి ప్ర‌వేశించిన‌ట్లు అవుతుంది.


డీ హీరేహాళ్ నుంచి ఏపీలో ప్రారంభం కానున్న‌ రాహుల్ యాత్ర.. ఈ నెల 21 దాకా రాష్ట్రంలోనే కొన‌సాగ‌నుంది. ఈ నెల 14న జ‌రిగే యాత్ర త‌ర్వాత రాహుల్ త‌న పాద‌యాత్ర‌కు 4 రోజుల పాటు విరామం ఇవ్వ‌నున్నారు. ఆ త‌ర్వాత తిరిగి 18న ఏపీలో యాత్ర‌ను కొన‌సాగించ‌నున్న రాహుల్‌... 21 దాకా ఏపీలోనే యాత్ర సాగిస్తారు. ఈ మేర‌కు ఏపీసీసీ నేత‌లు గిడుగు రుద్ర‌రాజు, జేడీ శీలం, రాజీవ్ ర‌త‌న్‌లు శ‌నివారం డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిని క‌లిసి యాత్ర రూట్‌మ్యాప్‌ను అంద‌జేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa