ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తీరును మార్చుకొనేందుకు ఓ విద్యార్థి వినూత్న ప్రయత్నం

international |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 10:59 PM

తన తీరును మార్చుకోవడానికి ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం మొదలెట్టాడు.  సకాలంలో పనులు పూర్తి చేయకుండా వాయిదాలు మీద వాయిదాలు వేస్తూ తర్వాత చేద్దాం అంటూ వారికి వారే సర్దిచెప్పుకుంటారు. కొన్నిసార్లు వరకైతే ఇది ఫర్వాలేదు. కానీ, ఇదే అలవాటుగా మారిపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థిదశలో మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా అవసరం. మధ్యలో ఎవరైనా వారికి ఇబ్బంది కలిగిస్తే ఏకాగ్రత లోపించి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కష్టమైన పనులు చేయడానికి మనసు కూడా అంగీకరించదు. వాయిదా అలవాటు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.


ఇటువంటి సమస్య నుంచి గట్టెక్కడానికి ఓ పీహెచ్‌డీ విద్యార్థి వినూత్నంగా ఆలోచించాడు. తన రిసెర్చ్ క్యాబిన్ వద్ద ఆ విద్యార్థి అతికించిన పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘దయచేసి నాతో ఎవరూ మాట్లాడొద్దు.. నేను పీహెచ్‌డీకి సంబంధించిన పనిలో ఉన్నాను.. ఒక వేళ నేను మాట్లాడటం మొదలుపెడితే మళ్లీ ఆపడం కష్టం... నేను భయంకరమైన వాయిదాలకోరును. వీలు దొరికితే చాలు నేను పనులు వాయిదా వేస్తుంటాను.. మరీ అవసరమనుకుంటే ఈ- మెయిల్‌ చెయ్యండి.. ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చాడు.


ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశోధనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఇది అవసరమవుతుందని స్టీవ్‌ బింగ్‌హామ్‌ అనే ప్రొఫెసర్ ట్విట్టర్‌లో దీనిని పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది నా కథే అని ఓ యువతి.. పీహెచ్‌డీ సమయంలో నేను ఒకసారి ఇలా చేస్తాను అని ఒకరు కామెంట్ చేస్తే.. నేను నా నుదుటిపై దీనిని అతికించుకుంటాను అని మరో నెటిజన్ ఫన్నీగా పోస్ట్ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa