గుంటూరు: రేపల్లె పట్టణంలోని 11వ వార్డులో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమములో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణా రావు పాల్గొన్నారు. వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కరెంటు బిల్లు అధికంగా వచ్చిందని పథకాలు ఆగిపోయాయని ఎంపీ మోపిదేవి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంపీ మోపిదేవి అధికారులను ఆదేశించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa