ఏపీలో బీఆర్ఎస్ మనుగడకు కాలమే సమాధానం చెప్పాలని, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటున్నారేమోనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక అమరావతి ఉద్యమం, జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు తనపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించిన నాని... సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్కు ఆయన సోదరుడు చిరంజీవి మద్దతు అవసరం రాకపోవచ్చన్న నాని... 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు మద్దతు ఉంటే చాలని అన్నారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చెబుతున్నదంతా ట్రాషేనన్న నాని... 200 ఏళ్లు అయినా అమరావతి నిర్మాణం పూర్తి కాదని అన్నారు.
అనంతరం తన సొంత కులానికి చెందిన టీడీపీ నేతలు తనపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించిన నాని... మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అమాయకులైన అమరావతి రైతుల ముసుగులో కమ్మ కుల ఉగ్రవాదులు చేస్తున్నదే పాదయాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. తనను కుల బహిష్కరణ చేయడానికి ఓడిపోయిన 10 మంది కమ్మ టీడీపీ నేతలు గుడివాడలో తొడలు కొట్టారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa