ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 10:32 AM

ధర్మవరం పట్టణంలో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం నాయకులు వినూత్నంగా గుంతల రోడ్లలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పట్టణంలోని రేగాటిపల్లి రైల్వేగేటు సమీపం నుంచి రేగాటిపల్లికి వెళ్లే రహదారిలో రోడ్డంతా బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు. పాలకులు స్పందికపోవడంతో సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు, సిపిఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, ఎస్‌హెచ్‌. బాషా, ఎల్‌. ఆదినారాయణ, చౌడప్ప, మారుతి, ఎస్‌ఎఫ్‌ఐ నాగార్జున, హరి, జేవీ రమణ, నిరంజన్‌, దాము తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa