అసెంబ్లీ నియోజకవర్గాల క్షేత్రస్థాయి నేతలతో సమావేశమైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ నియోజకవర్గానికి మంత్రి గుమ్మనూరి జయరాం ప్రాతినిథ్యం వహించారు. ఈ సమావేశానికి ఆలూరు నియోజకవర్గానికి చెందిన వంద మందికి పైగా నాయకులు హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయన్న జగన్... నేటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో నేతలంతా కలిసికట్టుగా పని చేస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని సూచించారు. గత మూడేళ్లలో ఆలూరు నియోజకవర్గ ప్రజల ఖాతాల్లో వివిధ పథకాల ద్వారా రూ.1050 కోట్లు జమ చేశామని జగన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa