జన సైనికులు లైటింగ్ పట్టగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు చేరుకొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అదే సమయంలో విచిత్ర పరిస్థితులు కూడా ఆయనకు స్వాగతం పలికాయి. శనివారం సాయంత్రి చీకటిపడే సమయంలో విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్న పవన్... ఎయిర్ పోర్టు నుంచి తాను బస చేసే విడిదికి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పవన్ ర్యాలీ సాగే మార్గంలో రోడ్డుకు ఇరవైపలా స్ట్రీట్ లైట్ల వెలగలేదు. అయినా కూడా వెనక్కు తగ్గని పవన్ కల్యాణ్ చీకట్లోనే ర్యాలీతో ముందుకు సాగారు.
రేపు విశాఖ పోర్టులోని కళావేదికలో రేపు జనసేన ఉత్తరాంధ్ర జనవాణిని పవన్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయం నేరుగా అక్కడికే బయలుదేరిన పవన్ వెంట భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. పవన్ కాన్వాయ్కు ముందుగా జన సైనికులు బైక్ ర్యాలీతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్ట్రీట్ లైట్లు వెలగని విషయాన్ని గమనించిన జనసేన శ్రేణులు తమ సెల్ ఫోన్లలోని లైటింగ్ను ఆన్ చేశారు. ఈ సెల్ ఫోన్ల లైటింగ్లోనే పవన్ ర్యాలీ సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa