గోదావరి నాలుగో వంతెన మీదుగా యాత్రను ఎలా చేపడుతున్నారో తెలపాలంటూ పోలీసులు శనివారం అమరావతి రైతుల ఐకాస నేతలకు నోటీసులు అందించే యత్నం చేశారు. ఇదిలా ఉంటే ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర పేరిట యాత్ర సాగిస్తున్న రాజధాని రైతులకు పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చేందుకు యత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా కోవూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాదయాత్రలో భాగంగా ఆదివారం యాత్రకు విరామం ఇచ్చిన రైతులు సోమవారం కోవూరు నుంచి గోదావరి నాలుగో వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకోన్నారు. గోదావరిపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని మూసేసిన నేపథ్యంలో రైతులు నాలుగో వంతెనను ఎంచుకున్నారు.
ఈ క్రమంలో నాలుగో వంతెన మీదుగా యాత్రను ఎలా చేపడుతున్నారో తెలపాలంటూ పోలీసులు శనివారం అమరావతి రైతుల ఐకాస నేతలకు నోటీసులు అందించే యత్నం చేశారు. ఈ క్రమంలో యాత్ర శిబిరం చేరుకున్న కోవూర టూటౌన్ సీఐ రవికుమార్... ఐకాస కన్వీనర్ శివారెడ్డి, కో కన్వీనర్ గద్దె తిరుపతిరావులకు నోటీసులు అందించే యత్నం చేశారు. అందుకు ఐకాస నేతలు ఇద్దరూ తిరస్కరించారు. హైకోర్టు ఆదేశాల మేరకే తాము యాత్ర చేపడుతున్నామని, ఏ నోటీసు ఇవ్వాలన్నా కోర్టు ద్వారానే ఇవ్వాలని వారు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో నోటీసులు తీసుకోవాలంటూ సీఐ రవికుమార్.. తిరుపతిరావుపై ఒత్తిడి చేశారు. దీంతో ఆయన సీఐ కాళ్లపై పడబోయారు. ఫలితంగా నోటీసులను జారీ చేయకుండానే పోలీసులు వెనుదిరిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa