జనసేన నేతలు తనపై దాడి చేశారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మంత్రి రోజా విశాఖ ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కూడా అంతే వేగంగా జనసేన నేతలపై కేసులు పెట్టారు. విశాఖ ఎయిర్ పోర్టులో జనసేన శ్రేణులకు మంత్రి రోజా వేలు చూపుతూ రెచ్చగొట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. శనివారం విశాఖ విమానాశ్రయంలో మంత్రి రోజాపై హత్యాయత్నం జరిగిందని, ఒక సీఐ, ఎస్ఐపై దాడి చేశారని ఫిర్యాదు అందిందంటూ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. రోజాను హత్య చేయాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ సూచనలతోనే జనసేన కార్యకర్తలు రోజా కారును అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడి చేశారంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. మంత్రి విమానాశ్రయానికి వచ్చే సమయానికి పవన్ అక్కడికి రాలేదని, ఆయనను అరెస్టు చేయించాలనే దురుద్దేశంతోనే అలా కేసు పెట్టారని జనసేన నేతలు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa