రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం జిల్లాకు వస్తున్నారు. మంత్రి గురువారం సాయంత్రం జిల్లాకు చేరుకుంటారు. 21న శుక్రవారం ఉదయం 9 గంటలకు అనకాపల్లి వెళతారు. మధ్యాహ్నం 4 గంటలకు గుర్ల మండలం నాగళ్ల వలస లో గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభిస్తారు. 22న ఉదయం 10 గంటలకు బొబ్బిలి చేరుకొని మునిసిపాలిటీ పరిధిలో వున్న గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పథకానికి శంకుస్థాపన చేస్తారు. 11 గంటలకు రామభద్రపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనాలను ప్రారంభిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa