ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరమేశ్వరీ దేవి ఆలయంలో ఇస్రో చైర్మర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 09:32 PM

స్వామి ప్రయోగం సఫలం అయ్యేలా చూడు అని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి ఆలయంలో ఇస్రో చైర్మర్ సోమనాథ్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సోమనాథ్.. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ సజావుగా సాగుతోందని చెప్పారు. శనివారం అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 అంతరిక్షంలోకి దూసుకెళుతుందని వివరించారు.


ఈ నేపథ్యంలోనే రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు చేసినట్లు వివరించారు. యూకేకు చెందిన 108 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, అందులో భాగంగానే ప్రస్తుతం 36 ఉపగ్రహాలను పంపిస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రయోగం తర్వాత వరుసగా రాకెట్ ప్రయోగాలు చేపడతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు రాకెట్లను ప్రయోగిస్తామని ఆయన తెలిపారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa