ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో స్త్రీలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందించలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 05:17 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... వాసిరెడ్డి పద్మకు ఇప్పటికీ జగన్ భజన పై ఉన్న ఆసక్తి, మహిళా చైర్మన్ గా తన బాధ్యతలపై లేదు. సీబీఎన్ గారికీ, పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వాలన్న ఆతృత, రాష్ట్రంలో స్త్రీలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందించడానికి, చర్యలు తీసుకోవడానికి లేదు. గత మూడేళ్లలో మహిళలపై, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాల వివరాలతో స్వయంగా మేమే వెళ్ళి ఒక పుస్తకం ఇచ్చాం.. అందులో 1500 వరకూ ఘటనలు ఉన్నా, ఈవిడ ఆ ఫిర్యాదు ఆధారంగా ఒక్కరికి కూడా ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. అంతెందుకు.. నిన్న ఈరోజే పలు ఘటనలు జరిగాయి.. పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడానికి హడావిడిగా స్పందించిన ఈవిడ, గన్నవరంలో యువతిపై గంజాయి బ్యాచ్ సామూహిక అత్యాచార యత్నం ఘటనలో గానీ, జంగాలపల్లె విద్యార్థిని అనుమానాస్పద మృతి విషయంలో గానీ ఈవిడ స్పందించిందా? స్పందించదు.. భారతి రెడ్డి విషయంలో ఓ సోషల్ మీడియా పోస్ట్ పై రాత్రి పూట డీజీపీ ఆఫీస్ కు పరుగెత్తి ఫిర్యాదులు  చేసిన ఈవిడ.. పైన జరిగిన ఘోరమైన ఘటనలపై కనీసం మాట్లాడిందా? జగన్ రెడ్డి కోసం అయితే మాత్రం అర్ధరాత్రి అయినా స్పందిస్తుంది. ఎవరికైనా నోటీసులు ఇస్తుంది అని మీడియా ముఖంగా తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa