బుట్టాయగూడెం క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా తెదేపా ప్రభుత్వంలో అమరావతిని ప్రకటిస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపి తీరా వైసిపి అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రాన్ని మూడుముక్కలు చేయాలని ఆలోచనతో మూడు రాజధానులు ఉంటాయి రాష్ట్రానికి అని ప్రకటించి ఆంధ్రుల కలల రాజదానిని మరియు రాష్ట్ర భవిష్యత్ కోసం రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల ఆశలను చిదిమేసిన మూర్ఖుడు జగన్ రెడ్డి అని భూములిచ్చిన రైతులు రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి ఉండాలని అమరావతి టూ అరసవల్లి వరకు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే రాజధాని అమరావతి కి ప్రజల నుండి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేని జగన్ రెడ్డి మరియు అనుచరగణం పోలీసులను వైసిపి గుండాలను అడ్డం పెట్టుకుని పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం జగన్ రెడ్డి తుగ్లకు అని రుజువైందని, అదేవిధంగా రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు, వేదింపులు ఎక్కువయ్యాయని దశాదిశా లేని దిశా చట్టం పెరు చెప్పి మహిళను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజలకు చేరువలో పాలన లేదని అప్పులు తప్ప అభివృద్ది లేదని సంక్షేమం ముసుగులో ప్రజలకు ఇచ్చేది గోరంత జగన్ రెడ్డి దోచుకునే కొండంత అని ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలోనే ప్రజాక్షే త్రంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa