ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు ఆత్మహత్య ఘటనలో ముగ్గురు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 06:35 PM

ఆకివీడు,  దళిత ఆక్వా రైతు ఆత్మహత్య ఘటనలో ఎస్‌ఐ సహా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ తెలిపారు. అజ్జమూరుకు చెందిన దళిత ఆక్వా రైతు బూరగ నాగేశ్వరరావు (36) స్థానిక వైసీపీ నాయకులు, ఎస్‌ఐ వేధింపులు తాళలేక మనస్తాపంతో శనివారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విదితమే. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరించారు.. మృతుడు సూసైడ్‌నోట్‌లో తన చెరువు వద్ద పని చేస్తున్న విప్పర్తి సురేష్‌, ఆకివీడు నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ పుప్పాల పండు, ఎస్‌ఐ బీవై కిరణ్‌కుమార్‌ల పేర్లు రాశాడు. అయితే తన బంధువులకు పంపిన వాయిస్‌ రికార్డులో ఈ ముగ్గురి పేర్లతో పాటు ఆకివీడు ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ పుప్పాల చిన్నా పేరును కూడా ప్రస్తావించడంతో నలుగురిపైనా కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. వీరిలో సురేష్‌, చిన్నా, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని, పుప్పాల పండు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఏటీవీ రవికుమార్‌, ఎస్సీ–ఎస్టీ సెల్‌ డీఎస్పీ శుభాకర్‌ తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa