ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకొని అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 06:38 PM

జీలుగుమిల్లి సమీప పి.రాజవరం, చిర్రివారిగూడెం, దర్భగూడెం గ్రామాల్లో వాగుల నుంచి అటవీ మార్గంలో ఇటీవల కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై కొందరు పంచాయతీ అనుమతులు తీసుకున్నట్లు చెల్లని పత్రాలు చూపుతూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో  రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు ఎస్‌ఇబీ ఇన్‌చార్జి సీఐ ఎస్‌.మణికంఠరెడ్డి ఇసుక ట్రాక్టరుపై అక్రమంగా తరలిస్తుండటంతో పట్టుకున్నారు. పంచాయతీ అనుమతులు ఉన్నట్లు డ్రైవర్‌ తెలపటంతో పత్రాలు పరిశీలించామని అవి చెల్లవని తెలిపారు. మరోవైపు ఇసుక అక్రమ రవాణా సైతం స్థానిక పంచాయతీ సిబ్బందికి సంబంధిత ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి, మరుగుదొడ్ల నిర్మాణానికి ఒకటి రెండు ట్రక్కుల ఇసుక తరలిస్తే పట్టుకుని కేసు నమోదు చేసే అధికారులు వారం రోజులుగా జీలుగుమిల్లి సమీప ప్రాంతాల నుంచి అక్రమంగా టన్నుల కొద్ది ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకున్న అధికారి లేరని స్థానికులు వాపోతున్నారు. పోలీస్‌ రెవెన్యు అధికారులతో ఇసుక అక్రమ రవాణా చేసే వాహన చోదకులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఆలయ నిర్మాణం పేరుతో ఇసుక మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం పేరుతో అక్రమంగా నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక అక్రమార్జనకు అలవాటు పడ్డ వారు కొందరైతే కనీస అవసరాల పేరుతో ఎజెన్సీ చట్టాల ప్రకారం పేదల ఇళ్ల నిర్మాణానికి, నిర్వాసిత గృహల నిర్మాణం కోసం అంటూ ఉచితంగా పంచాయతీల ద్వారా ప్రభుత్వం ఇచ్చే కూపన్లు తీసుకున్నట్లు చెబుతూ పోలీస్‌ రెవెన్యు అధికారుల కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా కొందరు అక్రమ ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఇవేమి తెలియని పేదలు కొందరు ఇసుక నిబంధనలకు భయపడిన వారి ఇళ్ల నిర్మాణాలు సగంలోనే నిలిచాయంటూ వాపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa