మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయా లన్న సుప్రీం వ్యాఖ్యలతో సీఎం జగన్రెడ్డి నైతిక బాధ్యత వహించాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబాయి హత్య జరిగితే గుండెపోటుగా సృష్టించి, సొంత మీడియాలో చంద్రబాబుపై విషప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక కనీసం విచారణ కూడా చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వం హంతకులకు రక్షణనిస్తూ సీబీఐ అధికారులపెనేౖ కేసులు పెడుతోందని ఆరోపించారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవర్ దస్తగిరి ఇటీవల తనకు ప్రభుత్వం వల్ల ప్రాణహాని ఉందని చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే హత్య కేసులో ఉన్న ఇద్దరు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం, చిన్నాన్న కుమార్తె ‘అన్న ప్రభుత్వం’పై నమ్మకం లేక ఇతర రాష్ట్రాల్లో విచారణ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిందన్నారు. దీంతో కోర్టు సైతం ఆమె వాదనలను అంగీకరించిందన్నారు. దీనికి సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు షేక్ మహబూబ్ భాష, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, షేక్ ఇస్మాయిల్, షేక్ భాష, ఎలకపాటి చెంచయ్య, కర్రావుల రాజేంద్ర, గొట్టం శ్రీనివాసరెడ్డి, షేక్ మౌలాలి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa