రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు ఓటు హక్కుతో బుద్ది చెప్పాలని బీజేపీ నాయకులూ సిరసనగండ్ల శ్రీనివాసులు అన్నారు. బీజేపీ కార్యాలయంలో 6 మండలాల స్థాయిలో పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రశ్నిస్తే కేసుల పేరుతో కక్ష్య సాధింపు ధోరణికి పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలలో ఓటు హక్కు ద్వారా పట్టభద్రులు జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన మాధవరావు ఏనాడైనా ఈప్రాంతానికి వచ్చారా...? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు., అదే సమయంలో రాష్ట్రంలోని వైసీపీ అసమర్ధ ప్రభుత్వం గురించి ప్రజలకు కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ పల్లెం శ్రీనివాసులు, ఎంఎల్ సి ఎన్నికల ఇన్చార్జి వెంకటయ్యనాయుడు, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు కె.విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు బీవీ.రామాంజనేయులు, గుమ్మా రాములు, ఎం.శ్రీనివాసులు, బి.ఓబులేసుయాదవ్, రాచర్ల కాసులు, ఎం.పుల్లయ్య, సాయిచరణ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa