ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్చూరు లో గడప గడపకి మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 06:48 PM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు అన్నారు. పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా నిరుపేదలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించటానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్టు చెప్పారు. పార్టీలకతీతంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నా రు. కార్యక్రమంలో నాయకులు, జట్టి చంద్రం, లక్ష్మీనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa