వైసీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయంపై ముస్లిం మైనార్టీలు తిరగబడి, జగన్రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ఇస్లామిక్ బ్యాంక్ పెడతామని, దుల్హన్ పథకంలో రూ.లక్ష ఇస్తామని మైనార్టీలను నమ్మించి ఓట్లు వేయించుకుని జగన్రెడ్డి హామీలు గాలికి వదిలేసి, ఉత్తుత్తి బడ్జెట్ లెక్కలతో వారిని మోసం చేశాడని ఆరోపించారు. మైనార్టీలకు ఖర్చు చేయాల్సిన రూ.1,683 కోట్లు దారి మళ్లించారని చెప్పారు. మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్య, విదేశీ విద్య దూరం చేశారని విమర్శించారు. జగన్ పాలనలో వైసీపీ నేతలు అధికార మదంతో ఎంతో మంది మైనార్టీలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడగా, అనేక మందిపై కేసులు బనాయించారన్నారు. మూడున్నరేళ్లలో 63 మంది ముస్లింలపై దాడులు జరిగాయన్నారు. మైనార్టీలందరూ సమైఖ్యంగా పోరాడి తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa