ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 12:45 PM

శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో గల బలిఘట్టం గ్రామ సమీపంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సును నిర్వహించబోతున్నట్లు కొత్తవలస తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై తీసుకున్న అంశాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ రాంప్రసాద్, మాజీ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, పట్టబద్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa