ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గూడు లేని పేద వాడు ఉండకూడదు అనే ఆశయంతో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షలకు పైచిలుకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా మొదటి దశలో 15 లక్షలకు పైబడి ఇళ్లను మంజూరు చేసి దేశంలోనే ఎక్కడా లేనివిధగా రాష్ట్రంలో భారీ స్థాయిలో గృహనిర్మానాలు చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో గల పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన సుమారుగా 3, 300 గృహల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే నిన్న ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్ సమక్షంలో వార్డు సచివాలయంల ఇమ్మునిటరీ సెక్రెటరీలతో కలిసి సచివాలయం స్థాయి గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సమీక్షలో ప్రధానంగా గృహ నిర్మాణాలకి సంబంధించి సచివాలయంల వారీగా గృహ లబ్ధిదారులతో మాటలాడి ఇంకా ప్రారంభం చేయని ఇల్లు నిర్మాణం త్వరిత గతిని ప్రారంభం చేసేలా చర్యలు తీసుకోవాలని అవసరం అతే లబ్ధిదారులు కోరుకున్న చోటకు ఇల్ల స్థలాలు ఇవ్వటానికి అయినా సిద్దంగా ఉన్నాము అని ఎలా అయినా అనుకున్న సమయం లోపు ఇల్ల నిర్మాణాలు పూర్తి జరిగేలా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అంతా కూడా కృషి చేసి నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బి గౌరీశ్వరి, కమిషనర్ రామప్పలనాయుడు, ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, కౌన్సిలర్ సభ్యులు, హౌసింగ్ డిఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు, సచివాలయం ఇమ్మునిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa