ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖర్జూరాలు తింటే కలిగే లాభాలివే

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 03:34 PM

 ఖర్జూరాలు పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. ఇవి తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
- ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.
- ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
- ఖర్జూరాల్లో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ‘ఎ’ కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి, ఇతర కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
- ఖర్జూరాల్లో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి, కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
- ఖర్జూరాలు బరువు పెరగడానికి కూడా సహాయపడతాయి.
- మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు ‘కె’ విటమిన్ కూడా ఉంటుంది. నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్ మొదలైన పోషకాలు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.
- ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
- మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తదితర సమస్యలు ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa