కడప జిల్లాలో విషాధకరమైన ఘటన నెలకొంది. వరి పొలానికి పురుగుల మందు పిచికారీ చేసేందుకు వెళ్లి ముగ్గురు రైతులు మృత్యువాతపడ్డారు. వీరిలో ఒకరు యువకుడు ఉన్నారు. కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి (65), పెద్దిరెడ్డి బాల ఓబుల్ రెడ్డి (60) బుమ్ము మల్లికార్జునరెడ్డి (23) శుక్రవారం (అక్టోబర్ 28) ఉదయం వరి పొలంలో పురుగుల మందు పిచికారి చేసేందుకు ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారు. పురుగుల మందు స్ప్రే చేస్తుండగా.. కరెంటు స్తంభం నుంచి కిందికి వేలాడిన ఓ విద్యుత్ వైరు తగిలినది. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు ముగ్గురు రైతులు ఈ ఘటనలో మృత్యువాతపడ్డారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి అన్నదమ్ములు కాగా.. మల్లికార్జున్ రెడ్డి వీరి సమీప బంధువు. ముగ్గురు రైతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్ఐ డాక్టర్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa