రాష్ట్రంలో వైద్య విద్యకు స్వర్ణయుగం. వైద్య ఆరోగ్యరంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కారణంగా సానుకూల ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో గణనీయంగా ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్లు పెరగనున్నాయి. 2019 వరకూ రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరుగుదల అని వైసీపీ నాయకులూ తెలుపుతున్నారు. ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం. ఈ ఏడాదిలో ఈ సీట్లు పెరుగుదల దాదాపు ఖరారు. అంటే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకూ మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లు 970 అయితే ఈ మూడున్నరేళ్లలోనే మరో 953 సీట్లు పెరిగనట్టు అవుతుంది. మూడున్నరేళ్లలోనే మెడికల్ పీజీసీట్లు రెట్టింపు అవుతున్నాయి. తద్వారా పెద్ద సంఖ్యలో వైద్య నిపుణుల రూపంలో మానవవనరుల తయారీ. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైద్య బోధనా సిబ్బందిని నియమిస్తున్న ప్రభుత్వం. 1254 అసిస్టెంట్ ప్రొఫెసర్లని నియమించారు. 106 ప్రొఫెసర్ పోస్టులను క్రియేట్ చేశారు, 312 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను క్రియేట్ చేశారు, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను క్రియేట్ చేసిన ప్రభుత్వం. వేగంగా వీటిని భర్తీ చేసే ప్రక్రియ. అవసరమనుకుంటే ప్రైవేటు రంగంలో ఇచ్చే భారీ వేతనాలను ప్రభుత్వరంగంలోనూ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa