రాష్ట్రంలో అడవుల సంరక్షణకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, శాస్త్రసాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 23 శాతం ఉన్న అడవుల విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలని గత ఆగస్టు 5వ తేదీన జగనన్న పచ్చతోరణం ప్రారంభం సందర్భంగా సీఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. విజయవాడలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సెమినార్ ముగింపు కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అటవీ అధికారును కార్యోన్ముఖులను చేస్తూ, మార్గదర్శకం చేసే ఇటువంటి సెమినార్లు ప్రతి ఏడాది జరగాలని అన్నారు. కరోనా వల్ల సెమినార్లకు కొంత ఇబ్బంది ఏర్పడిందని, ఇకపై ప్రతి ఏటా ఈ సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. మానవాళి మనుగడకు అడవులు అత్యంత కీలకమని అన్నారు. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు అడవుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa