ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తలు నిజమని తాము నమ్మడంలేదు: కేంద్ర ప్రభుత్వం వెల్లడి

national |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 09:03 PM

ట్విట్టర్ 'బ్లూ టిక్' ఫీజు పెంపు విషయంలో వస్తున్న వార్తలను తాము నమ్మడం లేదని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలావుంటేట్విట్టర్ ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుండడం తెలిసిందే. ట్విట్టర్ లో సెలబ్రిటీ ఖాతాల 'బ్లూ టిక్' ఫీజును కూడా పెంచనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటిదాకా 'బ్లూ టిక్' ఫీజు రూపంలో నెలకు రూ.410 వసూలు చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఆ ఫీజును రూ.1,650కి పెంచనుందని ప్రచారం జరుగుతోంది. 


దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలు నిజమని తాము నమ్మడంలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఎలా వ్యాప్తి చెందుతోందో ట్విట్టర్ గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ట్విట్టర్ కు సవాల్ అని భావిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa