జాతీయ న్యాయసేవా అధికార సంస్థ, న్యూఢిల్లీ వారి ఆదేశానుసారంగా స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల సందర్భంగా అక్టోబర్ 31 నుండి నవంబర్ 13 వరకు పాన్ ఇండియా క్యాంపెయిన్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కడప జిల్లా వ్యాప్తంగా ఎస్ కవిత సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కడప వారి ఆధ్వర్యంలో మహిళా కేంద్రాకారాగారము, రామాంజనేయపురం, చలమారెడ్డి పల్లి, వైయస్సార్ సర్కిల్, తిలక్ నగర్, గురుకుల పాఠశాల, చిన్నచౌకు, ప్రకాష్ నగర్, అంగడి వీధి, ఇందిరా నగర్, తదితర 15 ప్రాంతాలలో 560 మందికి ఇంటింటి న్యాయ ప్రచారం, 17 ప్రాంతాలలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించి చట్టాల పట్ల, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాల పట్ల అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పేరా లీగల్ వాలంటరీలు, లా విద్యార్థినీ విద్యార్థులు, ఎన్జీవోలు, అంగన్వాడి వర్కర్స్, ప్రిన్సిపల్, గురుకుల పాఠశాల, ఉపాధ్యాయులు, ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa