ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ రెడ్డిని ప్రజలే తరిమికొట్టే రోజు దగ్గరలోనే వస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 01:06 PM

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ నాయకులూ  కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...  వైసీపీ దుర్మార్గాలను, జగన్ రెడ్డి అవినీతిని ఎండగడుతున్నారన్న అక్కసుతోనే అయ్యన్నపై పాలకులు కక్షగట్టారని ఆరోపించారు. అన్యాయంగా గతంలో ఇంటి ప్రహరిని కూల్చేసిన పోలీసులు ఈరోజు ఆయన కుమారుడు రాజేష్‌తోపాటు అయ్యన్నను రాత్రి వేళ బలవంతంగా తీసుకెళ్లడం చట్టవ్యతిరేకమన్నారు. పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి ఇళ్లలో ప్రవేశించడం ముఠానేత జగన్ పాలనలోనే చూస్తున్నామన్నారు. ఇలాంటి తప్పుడు పనులు మానుకోకుంటే జగన్ రెడ్డిని ప్రజలే తరిమికొట్టే రోజు దగ్గరలోనే వస్తుందని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa