ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకయ్యనాయుడుకు ఒంగోలులో సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 01:07 PM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సన్మానం ఒంగోలులో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం  మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పేర్కొన్నారు.  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకయ్యనాయుడుకు ఈనెల 5న ఘనంగా పౌరసన్మానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, డాక్టర్లు, లాయర్లు, ప్ర జలు, సీనియర్‌ జనతా పార్టీ నాయకుల సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్థానిక కర్నూలు రోడ్‌లోని మౌర్య హోటల్‌ నుంచి అద్దంకి బస్టాండ్‌ మీదుగా, గుంటూరు రోడ్డులోని ఏ1 ఫంక్షన్‌ హాలుకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 5 గంటలకు జరిగే పౌర సన్మానంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు. అనంతరం మౌర్య హో టల్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారని పేర్కొన్నారు. 6వ తేదీ ఉదయం ఒంగో లు రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి రైలులో చెన్నై బయలుదేరి వెళతారని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa