ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోండా ఉమ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 01:19 PM

టీడీపీ సీనియర్ నాయకులూ అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు అరెస్ట్‌ను నిరసిస్తూ... విజయవాడ, గాంధీనగర్‌లో టీడీపీ నేత బోండా ఉమ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. అయ్యన్నను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ....  అయ్యన్న, ఆయన కుమారుడు అరెస్ట్ అక్రమమని, రాష్ట్రంలో తాడేపల్లి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులపై హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa