పెద్దముడియం మండలం పెద్ద పసుపల గ్రామంలో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి దేవగుడి భూపేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి నిర్వహించారు. మొదట గ్రామంలో కృష్ణ దేవాలయంలో మరియు గంగమ్మ దేవాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామంలోని యువకులు, మహిళలు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ, ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, మన జిల్లా వాసి ముఖ్యమంత్రి అయితే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశించిన ప్రజలకు నిరాశను కలిగించడమే కాకుండా, సంక్షేమం అనే పేరుతో మాయ చేస్తూ అభివృద్ధి వైపు కన్నెత్తి కూడా చూడకుండా యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు.
ఈ దరిద్రపు ప్రభుత్వాన్ని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గద్దె దింపాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కొండారెడ్డి, ముద్దన మల్లారెడ్డి, రాజేష్ రెడ్డి, ఆగ్రో వెంకటేశ్వర్ రెడ్డి,. రవీంద్ర నాథ్ రెడ్డి, కొండారెడ్డి, శ్రీకాంత్ ,. పుల్లారెడ్డి, గురు, కండక్టర్ మల్లా రెడ్డి, నాగరాజుయాదవ్ , మహమ్మద్ రఫీ, అమీర్ భాష, గురు యాదవ్, కులశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కొట్టం శేఖర్, ఈశ్వరయ్య, బాల చెన్నారెడ్డి, సాయి పుల్లారెడ్డి , పి సుదర్శన్ రెడ్డి, పి రవీందర్ రెడ్డి , గురు శ్రీధర్ రెడ్డి, రాఘవరెడ్డి, పి రామచంద్రారెడ్డి, ఆనందరావు, మాజీ ఎం పిటి సి శామ్యూల్, సుందర్ రాజు,. కిషోర్, మనోహర్, కిరణ్, శామ్యూల్, జాషువా, ముద్దన శంకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు, దేవగుడి అభిమానులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa