వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎక్కడ కనుమరుగు అవుతామనే భయంతో తమ ఉనికిని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు నిర్వహిస్తున్నారని ఉరవకొండ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం కూడేరు మండలం మరుట్ల-2 కాలని గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్ పర్సన్ గిరిజమ్మ, ఎంపీపీ నారాయణరెడ్డి, అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ నిర్మలమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, వైస్ సుబ్బమ్మ,ప్రచార కార్యదర్శి బైరెడ్డి రామచంద్రారెడ్డి, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ ఓబులమ్మ, నాయకులు హరీష్ ,నీలకంఠరెడ్డి, పరమేశ్వరరెడ్డి, మధుసూదన్ రెడ్డి ,అధికారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa