ప్రధాని నరేంద్రమోడీ సభకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తుందదని వైఎస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై. వి. సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం తనను కలిసిన ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజకీయా లకు అతీతంగా సభను విజయవంతం చేస్తామ న్నారు. ప్రధాని సభా ప్రాంగణమైన ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో పర్యావరణానికి ఎలాంటి విఘాతం ఉండదని, సభ కోసం పొరపాటున ఒక్క మొక్క తీసినా ఆ స్థానంలో రెండు మొక్కలు నాటుతామన్నారు.
ప్రధాని మోడీ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజల పండగ లాంటిదని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం ప్రాధాన్యం భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో కోర్టు తీర్పును సుబ్బారెడ్డి స్వాగతిస్తూ, ఆది నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఈ తీర్పు ముందుగా వచ్చి ఉంటే ప్రధాని విశాఖపట్నం పర్యటనలోనే ఎయిర్ పోర్టు పనులకు శంకుస్థాపన జరిగేదని చెప్పారు. త్వరలో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్ పోర్టు పనులకు శ్రీకారం చుడతారని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa