వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఐదు వసంతాలు పూర్తవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నాయి. ఇందులో భాగంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, శరీన్ నగర్ లో "దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి" విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కేక్ కటింగ్ చేసి నాయకులకు,కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించి నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించామని,పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని,ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలను దగ్గర నుంచి చూసిన జగనన్న ప్రజలందరికీ ఏ ఏ సంక్షేమ పథకాలు కావాలో వాటిని మేనిఫెస్టోలో ప్రకటించి,వాటిలో నేటికీ 95 శాతం నెరవేర్చిన ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని, ప్రజా ప్రతినిధులందరికీ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి పంపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలని, సంక్షేమ పథకాలు అందని వారు ఎవరైన ఉంటే వారికి కూడా అందించాలని సూచించారని, కులం,మతం,ప్రాంతం తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని, పేద ప్రజల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.పిలుపు నిచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హాజరైన ప్రతీ ఒక్కరికీ పేరు,పేరున కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa