తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబుపై దాడి చేయడం హేయమైన చర్య అని పాణ్యం టీడీపీ ఇన్చార్జ్ గౌరుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కల్లూరులోని 33వ వార్డు ఇందిరమ్మ కట్టవద్ద తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడారు. రాష్ట్రంలో తుగ్లక్పాలనకు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన సీఎం పిల్లచేష్టలకు పోతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముందుగా ఆమె మారెమ్మ దేవాలయంలో పూజలు చేసి, అంబేడ్కర్ సర్కిల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్వీ రామకృష్ణ, ప్రభాకర్యాదవ్, ఎస్.ఫిరోజ్, కాసాని మహేష్గౌడు, గంగాధర్గౌడు, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, మాదేష్, ధనుంజయ, చిన్నమారెన్న, ఆకేపోగు వెంకటస్వామి, శ్రీనివాసరావు, సంపతి నాగిరెడ్డి, గురుస్వామి, అల్లిపీరా, పవన్, మాలాలి, కల్లూరు గొర్రెల సంఘం అధ్యక్షుడు శేషన్న, క్యాతూరు మధు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa