స్మార్ట్ ఫోన్లు వచ్చాక నేరాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. మంచి కోసం వాడాల్సిన ఈ సాంకేతికతను కొందరు అగంతకులు తమ స్వార్థానికి వాడుకొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో న్యూడ్ కాల్స్ కలకలంరేపింది. పాములపాడులో కొంతమంది మహిళలకు గుర్తు తెలియని వ్యక్తులు న్యూడ్ కాల్స్ చేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పాములపాడులో కొందరు అగంతకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి ఈ న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ చేసిన సమయంలో డ్యాన్సులు వేస్తూ.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మహిళలు భయంతో ఆ కాల్స్ను కట్ చేసినా.. మళ్లీ, మళ్లీ ఫోన్ చేసి వేధిస్తున్నారు.
అగంతకుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో కొంతమంది బాధిత మహిళలు ధైర్యంతో పోలీసుల్ని ఆశ్రయించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది మహిళల్ని బూతులు తిట్టడంతో భయడపడుతున్నారు. కొందరు పరువు పోతుందన్న భయంతో బయటకు చెప్పలేకపోతున్నారు. బాధిత మహిళలు బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఎవరైనా ఇలా ఇబ్బందిపడుతుంటే బాధితులు తమకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఫిర్యాదు చేస్తే సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేస్తామంటున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కాల్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. త్వరలోనే వీడియో కాల్స్ చేస్తున్న అగంతకులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామంటున్నారు. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa