ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పార్టీలపై గళమెప్పిన ఇప్పటం గ్రామస్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 01:55 AM

ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కాకపుట్టిస్తున్న ఇప్పటం గ్రామం అంశం తాజాగా మరో మలుపు తిరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఇప్పటం గ్రామస్తులు ఫైరయ్యారు. డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించవద్దని హితవుపలికారు.గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ప్రతిపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమకు ఇళ్లు ఎవరూ కూల్చలేదని.. తమకెవరి సానుభూతి అవసరం లేదని ఇప్పటం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, అనవసర పర్యటనలు మానుకుంటే మంచిదని ఇప్పటం వాసులు కుండబద్దలు కొట్టారు. ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన ప్రభుత్వం.. పలుచోట్ల ఆక్రమణలో ఉన్న ప్రహరీగోడలు తొలగించిన విషయం తెలిసిందే.


అయితే, తమ పార్టీ సానుభూతిపరుల ఇళ్లను కూల్చేశారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే ఇప్పటంలో పర్యటించి.. ప్రభుత్వం కూల్చేసిన ఇళ్లకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటం ప్రజలు మాత్రం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తమకు గతంలో ప్రకటించిన రూ. 50 లక్షలే ఇంకా ఇవ్వలేదని, ఇప్పుడు మరో ఉచిత హామీ ఇచ్చారని చెబుతున్నారు.


అయినా రోడ్డు విస్తరణ కోసం కేవలం ప్రహరీలే తొలగించడం జరిగిందని, ఎవరి ఇళ్లనూ కూల్చలేదని చెబుతున్నారు. లేని కూల్చివేతలకు పరిహారమంటూ పవన్ వచ్చి వెళ్లారని, ఇప్పుడు మరోసారి రాజకీయం చేద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ ఇప్పటం ప్రజలు ఇళ్లపై ఫ్లెక్సీలు కట్టి మరీ తమ నిరసన తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa