గుంటూరు నగరంలో ఈ నెల 11న జరిగే ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర కమిషనరు కీర్తి చేకూరి తెలిపారు. ఈ నెల 11న గుంటూరు నగరంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనలో చేపట్టాల్సిన పనుల పర్యవేక్షణకు నగరపాలక సంస్థ నుండి అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించామని నగర కమిషనరు కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం ఏర్పాట్లను పరిశీలించిన ఆమె విలేకరులతో మాట్లాడుఊ ముఖ్యమంత్రి పర్యటనలో చేపట్టాల్సిన పనుల పర్యవేక్షణకు నగరపాలక సంస్థ నుంచి అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించామని అన్నారు. డివైడర్ పెయింటింగ్ పనులు మందకొడిగా జరగడం గమనించి, ఎక్కువ టీంలను ఏర్పాటు చేసుకొని, బుధవారం రాత్రికి పూర్తి చేయాలని ఆదేశించారు. విజ్ఞాన మందిరం ఆడిటోరియంలో లైటింగ్, పెయింటింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు, ఫుడ్ కౌంటర్స్ పనులు వేగంగా జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఆర్డీవో ప్రభాకరరెడ్డి, ఎస్ఈ భాస్కర్, డిప్యూటీ కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య, ఈఈ సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటీ ప్లానర్ కోటయ్య, ఏడీహెచ్ రామారావు, ఏసీపీలు, డీఈఈలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa