ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాదుడే బాదుడు కరపత్రాలను గ్రామంలో పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 04:20 PM

 టీడీపీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. కావలి మండలం మన్నంగిదిన్నెలో బుధవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం, టీడీపీ ముఖ్యనేతల, కార్యకర్తల సమావేశం జరిగింది. ముందుగా సమావేశం నిర్వహించి గ్రామంలోని ముఖ్య నాయకుల సలహాలు, సూచనలు స్వీకరించి పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి వివరించారు. అనంతరం పెరిగిన ధరలతో సామాన్యులు పడుతున్న కష్టాలను తెలిపే బాదుడే బాదుడు కరపత్రాలను గ్రామంలో పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ రూరల్‌ మండల అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, నేతలు మోర్ల వెంకట్రావు, దేవరకొండ కోటేశ్వరరావు, సూరిశెట్టి సురేష్‌, ఉదయగిరి కోటేశ్వరరావు, శ్రీహరి, బ్రహ్మయ్య, జంపాని శ్రీనివాసులు, ఉప్పాల మాలకొండయ్య, పులి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa