ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పి అధికారాన్ని చేపట్టి ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై పెనుభారాన్ని మోపాడని టీడీపీ మండల కన్వీనర్ హనుమంతు పేర్కొ న్నారు. బుధవారం కొంతానపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం పెంచిన పన్నులపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందాలంటే నారా చంద్రబా బునాయుడును మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వన్నూరుస్వామి, వైస్ సర్పంచ్ హనుమంతు, టీడీపీ నాయకులు కాటా వెంకటేశులు, గిరిధర్ నాయుడు, సోమశేఖర్, తిమ్మారెడ్డి, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa