సిఐటియు కడప జిల్లా 9వ మహాసభలు డిసెంబర్ 29, 30 తేదీలలో కడప నగరంలో జరుగుతాయని సిఐటియు జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కామనూరు శ్రీనువాసులురెడ్డి, బి. మనోహర్ తెలిపారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో బి. మనోహర్ ప్రసంగించారు. ఉద్యోగ, కార్మిక సమస్యల పరిష్కారానికై సిఐటియు జిల్లాలో ముందు నుంచి పోరాడుతోందని ఈ సందర్భంగా వివరించారు. రిమ్స్, యూనివర్సిటీ లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు అంగ న్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశాలాంటి స్కీం వర్కర్ల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న కార్మిక సంఘం సిఐటియు అని ఆయన వివరించారు.
కడప జిల్లాలోని 36 మండలాలకు చెందిన కార్మికనేతలు ఈ మహా సభల్లో పాల్గొని జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారని వివరించారు. ఈ మహాసభలకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎం. ఎ. గపూర్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి ఎం. బలకాశిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, పలువురు ప్రముఖులు ఈ మహాసభలలో ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని సిఐటియు శ్రేణులు, యూనియన్లు మహాసభల జయప్రదానికై కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు సిఐటియు నేతలు కడప జిల్లా మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి. లక్ష్మిదేవి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa