ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే జనవరిలో విశాఖపట్నంలో ఇంటర్నెట్ ఎక్చేంజ్ ఏర్పాటు : జీవీఎల్ నరసింహారావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 13, 2022, 10:11 PM

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పలు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖలో ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. వచ్చే జనవరిలో విశాఖపట్నంలో ఈ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఇంటర్నెట్ వేగం, నాణ్యత పెరగడంతో పాటు చార్జీలు తగ్గుతాయని తెలిపారు. ఐటీ, ఆర్థిక, బ్యాంకింగ్ సేవలకు ఊతం లభిస్తుందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa