ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వధర్మ వాహిని ప్రచార యాత్ర ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 01:55 PM

కాణిపాకం నుంచి సోమవారం స్వధర్మ వాహిని ప్రచార యాత్ర ప్రారంభమవుతుందని ఆలయ ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రసరస్వతి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 14న కాణిపాకం, 15న కుప్పం, 16, 17తేదీల్లో బెంగళూరు సిటీ, 18న కోలార్‌, 19న చింతామణి, 20న మైసూర్‌, 21న హిందూపురం, 22న లేపాక్షి, 23న రాయదుర్గం, 24న బళ్లారి, 25న రాయచూర్‌, 26న మంత్రాలయం, 27న ఎమ్మిగనూరు, 28న కోడుమూరు, 29న తాడిపత్రి, 30న కదిరి, డిసెంబరు 1న అనంతపురం, 2న కసాపురం, 3న గండి, 4న ప్రొద్దుటూరు, 5న కడప, 6న రాయచోటి, 7, 8 తేదీల్లో హైదరాబాద్‌, 9న మాచర్ల, 10న నరసారావుపేట, 11, 12తేదీల్లో విజయవాడలో పర్యటించనున్నట్లు తెలిపారు. యాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa