ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెడుగా ప్రచారం చేస్తున్నాడన్న కారణంతో హత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 01:58 PM

పొదలకూరు, మండలంలోని మర్రిపల్లికి చెందిన డోలా రఘు అనే యువకుడిపై పంచాయతీ బస్టాండ్‌లో హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులను పొదలకూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ సంగమేశ్వరరావు, ఎస్‌ఐ కరీముల్లా ఆదివారం ఈ కేసుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని మస్తాన్‌రెడ్డినగర్‌కు చెందిన అక్కరపాక శివ, సైదాపురం మండలం తురిమెర్లకు చెందిన సందిటి తేజ అనే ఇద్దరు నిందితులు చదువు మధ్యలో ఆపేసి, అల్లరిచిల్లరగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో మర్రిపల్లికి చెందిన వీరి స్నేహితుడైన రఘు తమపై చెడుగా ప్రచారం చేస్తున్నాడన్న కారణంతో పాత గొడవలను మనసులో పెట్టుకుని అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 11న రఘుపై కత్తితో దాడి చేయగా తప్పించుకున్నాడు. అదేరోజు రాత్రి మరలా బస్సు కోసం వేచి ఉన్న రఘుని బస్టాండులో కొట్టి, మరలా కత్తితో పొడవబోగా.. స్థానికులు అడ్డుపడడంతో వారిపై కూడా దాడికి దిగి ఆ ప్రాంతంలో హల్‌చల్‌ చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఆదివారం నిందితులను సంగం రోడ్డులో అరెస్టుచేసి గూడూరు కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులు, యువత గొడవలకు దూరంగా ఉండాలని, వాటిని ప్రోత్సహించే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa