ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ వైఫల్యం ప్రశ్నిస్తే కేసుల: చంద్రబాబు నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 08:22 PM

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కోడుమూరులో చంద్రబాబు రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని విమర్శించారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది తెలుగుదేశం పార్టీయేనని వెల్లడించారు. ఈ మూడేళ్లలో ఒక్క పని అయినా చేశారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. 


రోడ్లపై గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా? అంటూ నిలదీశారు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త సీఎం జగన్ రెడ్డి అంటూ విమర్శించారు. "ఈ ముఖ్యమంత్రి ఒక జాబ్ కాలెండర్ ఇచ్చాడా? ఏంచేశాడు ఈ ముఖ్యమంత్రి? అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. ఎవరన్నా గట్టిగా నిలదీస్తే పోలీసులు మీ ఇంటికి వస్తారు... పోలీసులకు న్యాయం చేశాడా అంటే అదీ లేదు. ఇప్పుడీ పోలీసుల పొట్ట కొడుతున్నాడు ఈ జగన్ రెడ్డి. పోలీసులూ... మీ డీఏలు, పీఎఫ్ లు వస్తున్నాయా? మీక్కూడా ఏమీ రావడం లేదు. మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగమే. ఓసారి నేను గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే రూ.18 కోట్లు వచ్చారు. నేను మళ్లీ మాట్లాడితేనే మీ డబ్బులు వస్తాయి... ఆ విషయం పోలీసులు గ్రహించాలి. పోలీసులు ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. 


రాష్ట్రంలో సీఐడీ డిపార్ట్ మెంట్ ఓ పనికిమాలిన దద్దమ్మ శాఖలా మారింది. ఎవరైనా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ముందు వీళ్లు వస్తారు. వాళ్లకి చట్టం లేదంట! తప్పు చేసిన అధికారులను వదిలేది లేదు... వారిని బోనెక్కించే బాధ్యత నాది. జగన్ ను నమ్ముకుంటే జైలుకు పోతారు... నన్ను నమ్ముకుంటే రాచబాటలో నడుస్తారు. మీకు బంగారు భవిష్యత్ లభిస్తుంది.


కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఎగిరెగిరిపడ్డాడు... కారు డ్రైవర్ ను చంపి, ఇంటికి పంపించి అంత్యక్రియలు చేసుకోమన్నాడు. ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, పోలీసులు ప్రయత్నించారు కానీ అతడికి బెయిల్ కూడా రాలేదు. జగన్ మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. అటు బాబాయ్ ను చంపారు... ఈ కేసు వేరే రాష్ట్రానికి మార్చారు. 


ఎగిరెగిరిపడేవారికి వార్నింగ్ ఇస్తున్నా, వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా... ఖబడ్దార్, జాగ్రత్తగా ఉండండి... రౌడీలను పరిగెత్తించిన పార్టీ టీడీపీ... ముఠాలను రూపుమాపిన పార్టీ టీడీపీ... మతవిద్వేషాలు కట్టడి చేసిన పార్టీ, తీవ్రవాద సమస్యలు పరిష్కారం చేసిన పార్టీ టీడీపీ... నేను తలుచుకుంటే ఈ రౌడీ రాజకీయాలు అణచలేనా తమ్ముళ్లూ! దయాదాక్షిణ్యాలు లేకుండా అణచివేస్తా. వడ్డీతో సహా వడ్డిస్తాం" అని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa